ఇదివరలో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన “నాన్న” పుస్తకాన్ని పరిచయం చేసుకున్నాం. కేరళలో హిందీ ప్రొఫెసర్ ఈచర వారియర్ వేదనాభరిత గాధను సి. వనజ తెలుగు పాఠకులకు అందించారు. అదే కేరళనుంచి మరో గొప్ప పుస్తకాన్ని అదే హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించింది. ఆ పుస్తకం సి.కె. జాను అసంపూర్తి ఆత్మకథ “అడవితల్లి"ని ఈ వారం పరిచయం చేస్తున్నాను.
2003 ఫిబ్రవరి 19వ తేదీన కేరళలో వైనాడ్ జిల్లాలోని ముతాంగ రిజర్వ్ ఫారెస్టులో ఆందోళన చేస్తున్న గిరిజనులపై జరిపిన పోలీసు కాల్పులలో ఒక గిరిజనుడు, ఒక కానిస్టేబుల్ చనిపోయారు. అప్పుడు ఆ ఆందోళనలో ప్రముఖంగా వినిపించిన పేరు సి. కె. జాను. ఎలాంటి సర్టిఫికేట్లు, డిగ్రీలు లేని జాను పాఠశాల చదువుకు చాలా దూరం. కేరళ ప్రభుత్వం చేపట్టిన 'అక్షరాస్యత' కార్యక్రమాల్లో చదవడం,రాయడం నేర్చుకున్న జాను ఆ తరువాత ఒక ప్రజా ఉద్యమానికి నయకురాలవడం యాదృచ్చికం కాదు. మూడు పదుల ప్రాయం నిండకుండానే భారతదేశమంతటా పర్యటించి, నాలుగు పదులలోనే ప్రపంచమంతా చుట్టివచ్చి ఆదివాసీల అసలు సిసలు సమస్యల గురించి, పరిష్కారాల గురించి సభలలో, సమావేశాలలో కీలక చర్చలకు పెట్టడం అపురూపమైన విషయం.
అబ్బురపరిచే తన జీవనయానాన్ని సి. కె. జాను మలయాళంలో చెప్పుకుపోతుంటే ఆంగ్లవార పత్రిక 'ది వీక్'లో చిత్రకారుడు భాస్కరన్ అక్షరరూపమిచ్చారు. దానిని ఎన్. రవిశంకర్ ఇంగ్లిషులోకి అనువాదం చేయగా, ప్రముఖ స్త్రీవాద రచయిత్రి పి. సత్యవతి తెలుగు పాఠకులకు అందించారు. ఎంతో సరళంగా, సాఫీగా సాగిన అనువాదం మనలో ఎన్నో ప్రశ్నలను రేకెత్తిస్తుంది.
రెండే భాగాలుగా సాగిన ఈ అసంపూర్తి ఆత్మకథలో చెప్పిన విషయాలే ఇంత హృద్యంగా ఆకట్టుకుంటే చెప్పని విషయలు ఇంకెంత ఆసక్తికరంగా వుంటాయోకదా అనిపిస్తుంది. ఒక బీద కుటుంబంలో పుట్టిన ఆదివాసీ అమ్మాయి జాను ప్రకృతిలో ఎలా మెలిగిందో, ఎలా పెరిగిందో, ప్రకృతి శక్తిగా ఎలా ఎదిగిందో ఈ పుస్తకం చెప్తుంది. దుర్భరమైన పేదరికం కావడంతో తల్లి జానును వేరే ఊర్లో మేరీ కుట్టి అనే టీచర్ కూతుర్ని ఆడించే పనిపిల్లగా గడిపి, ఆవిడకు వేరేచోటికి బదిలీ అయినతర్వాత సొంతగూటికి చేరుకుంటుంది. ప్రకృతి సంపదంతా తమదనుకునే గిరిజనం చిందిస్తున్న స్వేదానికి ఖరీదుకట్టే షరాబులా మధ్యలో భూస్వామి రావడం వారికి అయోమయం కలిగించే అంశం. ఆదివాసీల బలహీనతలను ఆసరాగా చేసుకుని భూస్వాములు కొనసాగిస్తున్న ఆగడాలను మౌనంగా భరించడం అలవాటు చేసుకున్నారు.
Answers & Comments
Answer:
Teri to band Kar nahi to dekker samajhle
Answer:
ఇదివరలో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన “నాన్న” పుస్తకాన్ని పరిచయం చేసుకున్నాం. కేరళలో హిందీ ప్రొఫెసర్ ఈచర వారియర్ వేదనాభరిత గాధను సి. వనజ తెలుగు పాఠకులకు అందించారు. అదే కేరళనుంచి మరో గొప్ప పుస్తకాన్ని అదే హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించింది. ఆ పుస్తకం సి.కె. జాను అసంపూర్తి ఆత్మకథ “అడవితల్లి"ని ఈ వారం పరిచయం చేస్తున్నాను.
2003 ఫిబ్రవరి 19వ తేదీన కేరళలో వైనాడ్ జిల్లాలోని ముతాంగ రిజర్వ్ ఫారెస్టులో ఆందోళన చేస్తున్న గిరిజనులపై జరిపిన పోలీసు కాల్పులలో ఒక గిరిజనుడు, ఒక కానిస్టేబుల్ చనిపోయారు. అప్పుడు ఆ ఆందోళనలో ప్రముఖంగా వినిపించిన పేరు సి. కె. జాను. ఎలాంటి సర్టిఫికేట్లు, డిగ్రీలు లేని జాను పాఠశాల చదువుకు చాలా దూరం. కేరళ ప్రభుత్వం చేపట్టిన 'అక్షరాస్యత' కార్యక్రమాల్లో చదవడం,రాయడం నేర్చుకున్న జాను ఆ తరువాత ఒక ప్రజా ఉద్యమానికి నయకురాలవడం యాదృచ్చికం కాదు. మూడు పదుల ప్రాయం నిండకుండానే భారతదేశమంతటా పర్యటించి, నాలుగు పదులలోనే ప్రపంచమంతా చుట్టివచ్చి ఆదివాసీల అసలు సిసలు సమస్యల గురించి, పరిష్కారాల గురించి సభలలో, సమావేశాలలో కీలక చర్చలకు పెట్టడం అపురూపమైన విషయం.
అబ్బురపరిచే తన జీవనయానాన్ని సి. కె. జాను మలయాళంలో చెప్పుకుపోతుంటే ఆంగ్లవార పత్రిక 'ది వీక్'లో చిత్రకారుడు భాస్కరన్ అక్షరరూపమిచ్చారు. దానిని ఎన్. రవిశంకర్ ఇంగ్లిషులోకి అనువాదం చేయగా, ప్రముఖ స్త్రీవాద రచయిత్రి పి. సత్యవతి తెలుగు పాఠకులకు అందించారు. ఎంతో సరళంగా, సాఫీగా సాగిన అనువాదం మనలో ఎన్నో ప్రశ్నలను రేకెత్తిస్తుంది.
రెండే భాగాలుగా సాగిన ఈ అసంపూర్తి ఆత్మకథలో చెప్పిన విషయాలే ఇంత హృద్యంగా ఆకట్టుకుంటే చెప్పని విషయలు ఇంకెంత ఆసక్తికరంగా వుంటాయోకదా అనిపిస్తుంది. ఒక బీద కుటుంబంలో పుట్టిన ఆదివాసీ అమ్మాయి జాను ప్రకృతిలో ఎలా మెలిగిందో, ఎలా పెరిగిందో, ప్రకృతి శక్తిగా ఎలా ఎదిగిందో ఈ పుస్తకం చెప్తుంది. దుర్భరమైన పేదరికం కావడంతో తల్లి జానును వేరే ఊర్లో మేరీ కుట్టి అనే టీచర్ కూతుర్ని ఆడించే పనిపిల్లగా గడిపి, ఆవిడకు వేరేచోటికి బదిలీ అయినతర్వాత సొంతగూటికి చేరుకుంటుంది. ప్రకృతి సంపదంతా తమదనుకునే గిరిజనం చిందిస్తున్న స్వేదానికి ఖరీదుకట్టే షరాబులా మధ్యలో భూస్వామి రావడం వారికి అయోమయం కలిగించే అంశం. ఆదివాసీల బలహీనతలను ఆసరాగా చేసుకుని భూస్వాములు కొనసాగిస్తున్న ఆగడాలను మౌనంగా భరించడం అలవాటు చేసుకున్నారు.
Hope this will help you ✨